నలుగురు ఎర్రస్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-06-15T05:27:57+05:30 IST
టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడుల్లో నలుగురు ఎర్రదొంగలు పట్టుబడిన సంఘటన రేణిగుంట మండలంలో జరిగింది.
రేణిగుంట, జూన్ 14: టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడుల్లో నలుగురు ఎర్రదొంగలు పట్టుబడిన సంఘటన రేణిగుంట మండలంలో జరిగింది. ముందస్తు సమాచారంతో సోమవారం మండలంలోని కరకంబాడి వద్ద ఉన్న కుక్కలగుండం అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పరారవగా, దొడ్లమిట్లకు చెందిన నలుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 9 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది భాస్కర్, లింగాధర్, నరసింహారావు పాల్గొన్నారు.