New delhi: యువతిపై అత్యాచారం, నలుగురు రైల్వే ఉద్యోగుల అరెస్టు

ABN , First Publish Date - 2022-07-23T20:52:14+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో 0 ఏళ్ల మహిళపై అఘాయిత్యం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఒక గదిలో..

New delhi: యువతిపై అత్యాచారం, నలుగురు రైల్వే ఉద్యోగుల అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 30 ఏళ్ల మహిళపై అఘాయిత్యం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఒక గదిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణపై నలుగురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ బాధితురాలి నుంచి శుక్రవారం తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు.


న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ 8-9 ఫ్లాట్‌ఫాంలో ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్‌ కోసం ఉద్దేశించిన ట్రైన్ లైటింగ్ హట్‌లో ఈ అత్యాచార ఘటన జరిగినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడయింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్) హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ, బాధితురాలు ఫరిదాబాద్ నివాసి అని చెప్పారు.


బాధితురాలి కథనం ప్రకారం.. నిందితులలో ఒకరిని రెండేళ్ల క్రితం ఒక ఉమ్మడి ఫ్రెండ్ ద్వారా ఆమె కలుసుకుంది. తాను రేల్వే ఉద్యోగినని, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని అతను ఆశచూపించాడు. గురువారంనాడు ఆ వ్యక్తి తన కుమారుడి పుట్టిన రోజు అంటూ ఆమెకు ఫోన్ చేశాడు. దాంతో ఆమె కీర్తి నగర్ మెట్రో స్టేషన్ చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకున్న అతను రైల్వే స్టేషన్‌లోని హట్‌లోకి తీసుకువెళ్లాడు. ఆ రూములోనే తనపై అత్యాచారం జరిగిందని, ఇద్దరు నిందితులు గది బయట కాపలాగా ఉన్నారని బాధితులురాలు ఫిర్యాదు చేసినట్టు డీసీపీ తెలిపారు.

Updated Date - 2022-07-23T20:52:14+05:30 IST