కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. అనంతరం జట్టు కత్తిరించి చెప్పుల దండతో ఊరేగించారు.. నిందితులు ఎవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-27T21:47:55+05:30 IST

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ అమానుష ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది.

కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. అనంతరం జట్టు కత్తిరించి చెప్పుల దండతో ఊరేగించారు.. నిందితులు ఎవరో తెలిస్తే..

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ అమానుష ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఓ మహిళను కిడ్నాప్‌ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆమె జట్టు కత్తిరించారు. మెడలో చెప్పుల దండలు వేసి ఊరంతా ఊరేగించారు. ఈ వ్యవహారంలో నలుగురు మహిళలను పోలీసులు నిందితులుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 


వివేక్‌ విహార్‌‌కి చెందిన ఓ మహిళను బుధవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్ర హింసలు పెట్టారు. ఆమె జుత్తు కత్తిరించి, మెడలో చెప్పుల దండలు వేసి కొడుతూ నడిరోడ్డుపై ఊరేగించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత మహిళను నలుగురు మహిళలే కిడ్నాప్ చేయించి ఆమెపై అత్యాచారం చేయించారని తేలింది. 


బాధితురాలితో వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. బాధిత మహిళకు గతంలో వివాహం జరిగి, ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె భర్త గతేడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు బాధిత మహిళే కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి ఆమెపై శత్రుత్వం పెంచుకుని తాజాగా ఈ దాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్టేట్‌మెంట్ ప్రకారం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-01-27T21:47:55+05:30 IST