NRI ఇంట్లో భారీ చోరీ.. ఏకంగా 3కిలోల బంగారంతో పాటు..!

ABN , First Publish Date - 2022-05-15T17:43:28+05:30 IST

కేరళ రాష్ట్రంలోని గురువాయుర్‌లో ఓ NRI ఇంట్లో భారీ చోరీ జరిగింది.

NRI ఇంట్లో భారీ చోరీ.. ఏకంగా 3కిలోల బంగారంతో పాటు..!

త్రిస్సూర్: కేరళ రాష్ట్రంలోని గురువాయుర్‌లో ఓ NRI ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఏకంగా మూడు కిలోల బంగారంతో పాటు రూ. 2లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువాయుర్‌ సమీపంలోని తంపురాన్పడిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముండే ఎన్నారై పారిశ్రామికవేత్త కురాంజియుర్ బాలన్ తన కుటుంబ సభ్యులను తీసుకుని సాయంత్రం సినిమాకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. లోపలికి వెళ్లే చూస్తే సామాన్లంతా చిందరవందరగా పడి ఉండడం కనిపించాయి. దాంతో వెంటనే నగలు, నగదు దాచిపెట్టిన సీక్రెట్ గదికి వెళ్లి చూడగా దుండగులు భారీ మొత్తంలో దోచుకెళ్లినట్లు గుర్తించారు. 


రెండు కిలోల రెండు గోల్డ్ బార్లు, మరికొన్ని గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్, కొన్ని నగలు కనిపించలేదు. వీటితో పాటు రూ.2లక్షల నగదు కూడా పోయింది. ఈ మేరకు కురాంజియుర్ బాలన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గురువాయుర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇంటి వద్ద ఏర్పాట్లు చేసిన సీసీటీవీ కెమెరాల్లో తమ ముఖాలు కనిపించకుండా దొంగలు జాగ్రత్తపడ్డారని గురువాయుర్ ఏసీపీ కేజీ సురేష్ వెల్లడించారు. చోరీకి పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నామన్నారు. కాగా, బాలన్‌కు యూఏఈలోని అజ్మన్‌‌లో బంగారం షాపు ఉందట. అక్కడి నుంచి వివిధ సందర్భాల్లో ఆయన ఈ పసిడిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఐదు నెలల క్రితమే బాలన్ యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చి తంపురాన్పడిలో ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2022-05-15T17:43:28+05:30 IST