అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 381 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20, 65, 235 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 14,365 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 4,743 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఏపీలో మొత్తం 20,46,127 మంది రికవరీ చెందారు.