బేతంచర్ల మున్సిపల్ ఎన్నికలకు రెండవ రోజు 38 నామినేషన్లు
ABN , First Publish Date - 2021-11-05T01:12:47+05:30 IST
బేతంచర్ల మున్సిపల్ ఎన్నికలకు రెండవ రోజు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ 34, వైసీపీ 1, బీజేపీ 2, ఇండిపెండెంట్
కర్నూలు: బేతంచర్ల మున్సిపల్ ఎన్నికలకు రెండవ రోజు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ 34, వైసీపీ 1, బీజేపీ 2, ఇండిపెండెంట్ ఒకరు నామినేషన్ వేశారు. బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. పంచాయతీ కార్యాలయంలోని 20వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసేందుకు 5 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులకు ఒక్కొక్కరికి నాలుగు వార్డులో చొప్పున కేటాయించారు. ఎన్నికల సహాయ కమిషనర్గా నంద్యాల కమిషనర్ వెంకటకృష్ణ, 21 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ తెలిపారు.