గుజరాత్లో కొత్తగా 363 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-23T03:34:55+05:30 IST
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.
అహ్మదాబాద్: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 363 కరోనా కేసులు నమోదయ్యాయి అధికారులు వెల్లడించారు. దీంతో గుజరాత్లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,200కు చేరింది. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. అలాగే కొత్తగా 29 కరోనా మరణాలు సంభవించడంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 802కు చేరిందని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ గుజరాత్లో 5,880 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది.