360 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-30T06:07:45+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉది. ఇరు జిల్లాల్లో మంగళవారం 360 కొత్త కేసులు నమోదయ్యాయి.
కొత్తగూడెం కలెక్టరేట్, సెప్టెంబర్ 29: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉది. ఇరు జిల్లాల్లో మంగళవారం 360 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో 92 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 268 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 2,274 మందికి పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ తేలింది. కొత్తగూడెం డివిజన్లో 143, భద్రాచలం డివిజన్లో 125 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.