Viral News: 36ఏళ్ల వ్యక్తికి తీవ్ర కడుపు నొప్పి.. ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.. ఎక్స్రే తీసి షాకైన వైద్యులు
ABN , First Publish Date - 2022-08-01T22:23:25+05:30 IST
అతడికి 36ఏళ్ల వయసు ఉంటుంది. ఉన్నట్టుండి అతడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమం
ఇంటర్నెట్ డెస్క్: అతడికి 36ఏళ్ల వయసు ఉంటుంది. ఉన్నట్టుండి అతడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎక్స్రే రిపోర్టును చూసి వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఇంతకూ ఎక్స్రేలో వైద్యులు ఏం గుర్తించారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన 36ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతడి పొట్టలో మెటల్ వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. సుమారు రెండు రోజులపాటు అతడికి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు.. సదరు వ్యక్తి పొట్టలోంచి దాదాపు 63 ఒకరూపాయి నాణేలను బయటకు తీశారు. 63 ఒక రూపాయి బిల్లలు అతడి కడుపులోకి ఎలా వెళ్లాయనే దానిపై డాక్టర్లు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలోనే రూపాయి బిల్లలను మింగేసి ఉంటాడని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా అతడిని మంచి సైకియార్టిస్ట్ చూపించాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించినట్టు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన జూలై 27న చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఇది హాట్టాపిక్గా మారింది.