65ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒక్కతే ఉందని తెలిసి.. 35ఏళ్ల వ్యక్తి చేసిన నిర్వాకమిది.. ఏం జరిగిందో తెలిస్తే..!
ABN , First Publish Date - 2021-11-16T18:16:14+05:30 IST
వయసు మీద పడడంతో..
ఇంటర్నెట్డెస్క్: వయసు మీద పడడంతో పనికి వెళ్లడం మానేసింది ఆ వృద్ధురాలు. భర్త, పిల్లలు పనికి వెళ్తున్నారు. ఒంటరిగా ఉందని తెలిసి ఓ వ్యక్తి ఆమె ఇంట్లోకి దూరాడు. ఇంటికి తిరిగొచ్చాకా భర్తకు, పిల్లలకు అసలు విషయం తెలియడంతో షాక్కు గురయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్లోని కోట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాకు చెందిన ఓ గ్రామంలో భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఓ వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు ప్రస్తుతం 65ఏళ్లు. కొన్నాళ్లవరకు భర్త, పిల్లలతో కలిసి పనికి వెళ్లేది. వయసు మీద పడడంతో ఇంటివద్దే ఉంటోంది. ఎప్పటిలాగే భర్త, పిల్లలు పనికి వెళ్లగా ఆమె ఇంట్లోనే ఉంది. ఆమె ఒంటరిగా ఉండడం గమనించిన దిలీప్ సింగ్ అనే 35ఏళ్ల వ్యక్తి ఆమె ఇంట్లోకి దూరాడు. పనికి వెళ్లిన వాళ్లు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చారు. అమ్మా.. అంటూ లోపలికి వెళ్లిన కుమారులు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్నారు. దిలీప్ సింగ్ అత్యాచారం చేశాడని తెలిసి అతడికోసం వెతికారు. కానీ అతడు ఎక్కడా కనిపించలేదు. వెంటనే సుకేత్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన అక్టోబర్ 17న జరిగింది. పోలీసులు నిందితుడి కోసం గాలించగా నవంబర్ 14న దొరికాడు. సోమవారం కోర్టుకు తీసుకెళ్లగా.. జైలుకు తరలించమని ఆదేశించింది.
సుకేత్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి రాంపాల్ శర్మ మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై గత నెల 17న దిలీప్ సింగ్ అత్యాచారం చేశాడని, నిందితుడి కోసం గాలించగా ఆదివారం దొరికాడని చెప్పారు. దిలీప్ ట్రక్ డ్రైవర్గా పని చేస్తుంటాడని, మద్యానికి బానిసై ఇంట్లో నిత్యం గొడవపడుతుంటాడని తెలిసిందని చెప్పారు. కోర్టు శిక్ష విధించడంతో జైలుకు తరలించామన్నారు.