బడ్జెట్లో 35 కొత్త స్కీమ్లు: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2022-03-07T22:12:53+05:30 IST
రాష్ట్ర బడ్జెట్లో 35 కొత్త స్కీమ్లు పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో 35 కొత్త స్కీమ్లు పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి హరీష్రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం స్కీమ్ కంటిన్యూ అవుతోందన్నారు. 3 లక్షల స్కీమ్కి, డబుల్ బెడ్ రూం స్కీమ్కి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 15 వందల మందికి దళితబంధును అందిస్తామన్నారు. ఈ ఏడాది 45 వేల మందికి దళితబంధు ఇస్తామన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి 2 లక్షల మందికి దళితబంధును అందిస్తామని ఆయన పేర్కొన్నారు.