హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2021-06-16T23:35:02+05:30 IST

జిల్లాలోని హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం

హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు మంజూరు

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 10 కోట్ల 52 లక్షలు, వార్డుల అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పట్టణంలో 35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 45 రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

Updated Date - 2021-06-16T23:35:02+05:30 IST