అగ్రరాజ్యంలో మ‌ళ్లీ జూలు విదిలిస్తున్న మ‌హ‌మ్మారి..!

ABN , First Publish Date - 2020-06-30T13:38:14+05:30 IST

అమెరికాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. వరుసగా మూడో రోజూ 40 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,831 మందికి వైరస్‌ సోకగా దేశంలో కేసుల సంఖ్య 26 లక్షల మార్కును చేరుకుంది. తాజాగా 285 మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 1,28,562కి చేరింది.

అగ్రరాజ్యంలో మ‌ళ్లీ జూలు విదిలిస్తున్న మ‌హ‌మ్మారి..!

వాషింగ్టన్‌, జూన్‌ 29: అమెరికాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. వరుసగా మూడో రోజూ 40 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,831 మందికి వైరస్‌ సోకగా దేశంలో కేసుల సంఖ్య 26 లక్షల మార్కును చేరుకుంది. తాజాగా 285 మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 1,28,562కి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 24గంటల్లో 1,60,586కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రెజిల్‌లోనూ తీవ్రంగానే ఉంది.


24 గంటల్లో 33,434 మందికి వైరస్‌ సోక డంతో మొత్తం కేసులు 13,52,708కి చేరాయి. రష్యాలో కొత్తగా 6,719 కేసులు వెలుగుచూశాయి. పాక్‌లో కొత్తగా 3,557కేసులు నమోదవగా మొత్తం బాధితులు 2,06,512కి చేరారు. కరోనా వైరస్‌ నిర్ధారణకు ఆస్ట్రేలియా లాలాజల పరీక్షని అందు బాటులోకి తెచ్చింది. ప్రాణాపాయానికి చేరిన కొవిడ్‌ రోగికి అమెరికా, మరికొన్ని దేశాలు రెమిడిసివిర్‌ అనే ఔషధాన్ని అందిస్తున్నాయి. ఒక్కోరోగికి రూ.17.66 లక్షల ఖర్చు అవుతుందని ఈ ఔషధ తయారీ సంస్థ వెల్లడించింది. 


Updated Date - 2020-06-30T13:38:14+05:30 IST