339 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-27T10:40:49+05:30 IST
339 పాజిటివ్ కేసులు
కొత్తగూడెం కలెక్టరేట్/ఖమ్మం సంక్షేమం, సెప్టెంబర్ 26: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం కొత్తగా 339కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 73కేసులు నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 266కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 2,137 మందికి పరీక్షలు నిర్వహించగా 266పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్లో 123, భద్రాచలం డివిజన్లో 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.