శివరాత్రికి 322 అదనపు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-03-05T07:27:11+05:30 IST

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 322 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

శివరాత్రికి 322 అదనపు ఆర్టీసీ బస్సులు

తిరుపతి(రవాణా), మార్చి 4: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 322 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 11, 12 తేదీల్లో శ్రీకాళహస్తి, తలకోన, కైలాసకోన, సదాశివకోన, అవంతి, మొగిలి, మల్లయ్యకొండ, మల్లప్పకొండ, సిద్ధేశ్వరకొండ, ఝరి, తవలం తదితర ప్రాంతాలకు వివిధ డిపోల నుంచి ఈ బస్సులను నడపుతామన్నారు. భక్తులుఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-05T07:27:11+05:30 IST