పండగ తర్వాత 32 వేల కేసులు

ABN , First Publish Date - 2022-01-25T07:06:07+05:30 IST

రాష్ట్రంలో సంక్రాంతి అనంతరం భారీగా కొవిడ్‌ కేసులు

పండగ తర్వాత 32 వేల కేసులు

  • రోజుకు సగటున 3,521 కేసుల నమోదు
  • రాష్ట్రంలో కొత్తగా 3,980 మందికి కొవిడ్‌ పాజిటివ్‌


 

హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్రాంతి అనంతరం భారీగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. పండుగ తర్వాత 9 రోజుల్లో ఏకంగా 31,960 పాజిటివ్‌లు వచ్చాయి. అంటే.. రోజుకు సగటున 3521 కేసులు రికార్డయ్యాయి. ఇక సంక్రాంతికి ముందు 9 రోజుల్లో 17,123 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 1,902 పాజిటివ్‌లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే పండుగ వెళ్లాక.. పాజిటివ్‌లు దాదాపు రెట్టింపు అయ్యాయి.


మరోవైపు సోమవారం రాష్ట్రంలో 97,113 మందికి టెస్టులు చేశారు. 3,980 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు చనిపోయారు. కొత్తగా 2,398 మంది కోలుకున్నారు. ఇంకా 33,673 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌లలో హైదరాబా ద్‌లో 1,439, మేడ్చల్‌లో 344, రంగారెడ్డిలో 234, హనుమకొండలో 159, ఖమ్మంలో 110 నమోదయ్యాయి. సోమవారం 2.57 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 1.91 లక్షల మందికి రెండో, 11,505 మంది ముందుజాగ్రత్త డోసు పొందారు. 15-18 ఏళ్ల వయసు వారిలో ఇప్పటివరకు 11.10 లక్షల మంది టీకా తీసుకున్నారు.


Updated Date - 2022-01-25T07:06:07+05:30 IST