జాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపిక
ABN , First Publish Date - 2020-05-29T10:50:53+05:30 IST
జాతీయ ఉపకార వేతనాలలో కిష్టాపూర్ పాఠశాల మరో సారి ప్రథమస్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
రాష్ట్రంలో కిష్టాపూర్ పాఠశాలకు ప్రథమ స్థానం
జన్నారం, మే 28 : జాతీయ ఉపకార వేతనాలలో కిష్టాపూర్ పాఠశాల మరో సారి ప్రథమస్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగం మల్లేష్ తెలిపారు. 2019కిగాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతనాల కోసం 62 మంది పరీక్షలు రాయగా 32 మంది సాధించి రాష్ట్ర స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచారు. 2016లో 43 మంది విద్యార్థులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించారని గుర్తు చేశారు. ఈ ఉపకార వేతనాలకు జిల్లా నుంచి 50 మందిని మాత్రమే ఎంపిక చేశారని, అందులో 32 మంది కిష్టాపూర్ విద్యార్థులే సాధించడం గర్వంగా ఉంద న్నారు. ఉపకార వేతకాలకు ఎంపికైన 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.12 వేల చొప్పున ఒక్కో విద్యార్థికి నాలుగు సంవత్సరాల పాటు రూ.48 వేలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయ బృందం శేఖర్, లక్ష్మినారాయణ తదితరులున్నారు.