317 జీవోను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-25T03:46:43+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన కోసం విడుదల చేసిన 317 జీవోను రద్దు చేయాలని టీపీయూఎస్‌ నాయకులు అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టీపీయూఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ మాట్లాడుతూ జీవోను రద్దు చేసి స్థాని కతను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

317 జీవోను రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న టీపీయూఎస్‌ నాయకులు

ఏసీసీ, జనవరి 24: ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన కోసం విడుదల చేసిన 317 జీవోను రద్దు చేయాలని టీపీయూఎస్‌ నాయకులు అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టీపీయూఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ మాట్లాడుతూ జీవోను రద్దు చేసి స్థాని కతను పరిగణలోకి తీసుకోవాలన్నారు.  విభజనలో అనేక తప్పులు దొర్లినా పరి ష్కరించకుండా బదిలీ ప్రక్రియను ముగించడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను పరిగణలోకి తీసుకోనందున వేరే జిల్లాకు బదిలీ అయ్యారని, ప్రభుత్వం  5 వేల మంది మా త్రమే బదిలీ అయ్యారని తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. ప్రభుత్వం  సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజనర్సు, సత్యనారాయణ, నరేష్‌, తిరుపతి, శారద పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-25T03:46:43+05:30 IST