30న తపాలా అదాలత్
ABN , First Publish Date - 2021-06-23T06:06:45+05:30 IST
తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల30న తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్ పీవీఎల్ఎన్వీ బాలసత్యనారాయణ తెలిపారు.
అమలాపురం టౌన్, జూన్ 22: తపాలా వినియోగదారుల
వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల30న తపాలా అదాలత్
నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్ పీవీఎల్ఎన్వీ బాలసత్యనారాయణ
తెలిపారు. అమలాపురం డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు సమస్యలు,
ఫిర్యాదులను 30వ తేదీలోగా తపాలా అదాలత్ శీర్షికతో అమలాపురం ప్రధాన తపాలా
కార్యాలయానికి పంపించాలని కోరారు. ఫిర్యాదుదారులు వ్యక్తిగతంగా కూడా 30వ
తేదీ సాయంత్రం 4గంటలకు జరిగే తపాలా అదాలత్కు హాజరుకావచ్చన్నారు.