మహాశివరాత్రికి 307 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2021-02-25T05:24:26+05:30 IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మార్చి 10, 11, 12 తేదీల్లో 307 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు.

మహాశివరాత్రికి 307 ప్రత్యేక బస్సులు

కడప(మారుతీనగర్‌), ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మార్చి 10, 11, 12 తేదీల్లో 307 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సులు కడప రీజియన్‌ పరిధిలోని 8 డిపోలు (కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, పులివెందు ల, బద్వేలు) నుంచి బయల్దేరనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు తాగునీటిని డిపోల్లో, శైవక్షేత్రాల్లో సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ముందస్తుగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులు పొలతల, లంకమల, బ్రహ్మంగారిమఠం, కన్యతీర్థం, సంగమేశ్వర దేవాలయాలు, జ్యోతి, నిత్యపూజకోన, తలకోన, భానుకోట, హత్యరాల, అగస్తేశ్వరకోన, అల్లాడుపల్లె దేవాలయాలు తదితర శైవక్షేత్రాలకు వెళ్లనున్నాయి. 

Updated Date - 2021-02-25T05:24:26+05:30 IST