మా దగ్గర 3 వేల వెంటిలేటర్లున్నాయ్: తమిళనాడు ఆరోగ్య మంత్రి

ABN , First Publish Date - 2020-04-04T23:45:20+05:30 IST

కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు తమ వద్ద 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తమిళనాడు...

మా దగ్గర 3 వేల వెంటిలేటర్లున్నాయ్: తమిళనాడు ఆరోగ్య మంత్రి

చెన్నై: కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు తమ వద్ద 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య మంత్రి సి. విజయ భాస్కర్ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ‘‘రాష్ట్రంలో మాకు 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో రెండు వేల వెంటిలేటర్లు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం...’’ అని మంత్రి వెల్లడించారు. ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు చేపడుతూనే... మరోవైపు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా స్టాన్లీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో కరోనా రోగులకు మందులు, ఆహారం అందించేందుకు ఇప్పటికే తమిళనాడు సర్కారు రోబోలను రంగంలోకి దించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-04T23:45:20+05:30 IST