300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్: అఖిలేష్

ABN , First Publish Date - 2022-01-01T21:45:06+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల 'ఉచిత' హామీల పర్వం సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా..

300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్: అఖిలేష్

లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల 'ఉచిత' హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్‌ ఉచితమని ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారంనాడు ప్రకటించారు. లక్నోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ ప్రసంగిస్తూ, ఇళ్లకు 300 యూనిట్ల వరకూ కరెంట్ ఉచితమని, రైతులకు సైతం ఇరిగేషన్ ‌కోసం ఉచితంగా విద్యుత్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ సైతం త్వరలో జరుగనున్న గోవా, అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీని ఇప్పటికే ప్రకటించింది.

Updated Date - 2022-01-01T21:45:06+05:30 IST