DK Shivakumar: 300 అడుగుల త్రివర్ణ పతాకంతో డీకే పాదయాత్ర
ABN , First Publish Date - 2022-08-09T18:20:46+05:30 IST
స్వాతంత్య్ర మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గాల వారీగా సాగిస్తున్న పాదయాత్రకు ఆదరణ లభిస్తోంది. సోమవారం
బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గాల వారీగా సాగిస్తున్న పాదయాత్రకు ఆదరణ లభిస్తోంది. సోమవారం రాజాజినగర్ బసవేశ్వర సర్కిల్ నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(KPCC President DK Sivakumar) నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది. 300 అడుగుల త్రివర్ణ ప తాకంతో ర్యాలీ నిర్వహించారు. మాజీ మేయర్ పద్మావతి, మాజీ కార్పొరేటర్లు కృష్ణమూర్తి, మంజుల(Manjula), మోహన్కుమార్, విజయకుమార్, వెంకటేశ్, యాపిల్ నాగరాజ్తోపాటు పలువురు పాల్గొన్నారు. 300 అడుగుల పతాకంతో హావనూరు సర్కిల్, బసవేశ్వరనగర్, కామాక్షిపాళ్య మార్గాల మీదుగా పాదయాత్ర కొనసాగించారు. అనంతరం దాసరహళ్లి, మహాలక్ష్మి లే అవుట్, యలహంక ని యోజకవర్గాల ప్రాంతాలలో ర్యాలీ సాగింది.