30 మందికి నెగిటివ్గా నిర్ధారణ
ABN , First Publish Date - 2020-06-07T10:29:25+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కరోనా పాజిటి వ్ వచ్చిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులతో పాటు ఆయనకు చికిత్స అందిం చిన వైద్యులు...
కామారెడ్డి టౌన్, జూన్ 6: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కరోనా పాజిటి వ్ వచ్చిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులతో పాటు ఆయనకు చికిత్స అందిం చిన వైద్యులు, సిబ్బంది 30 మంది యొక్క రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం శుక్రవారం గాంధీ ఆసుపత్రికి పంపగా వారికి నెగిటివ్గా నిర్ధారణ అయిందని జిల్లా కేంద్ర ఆసుపత్రి నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాగా తీవ్ర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న తాడ్వాయి, మాచారెడ్డి మండలాలకు చెందిన మరో ఇద్దరిని ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్కు రిఫర్ చేసినట్లు తెలిపారు.