Nirmalలో 30 గంగపుత్రుల కుటుంబాల వెలి

ABN , First Publish Date - 2022-06-22T15:03:55+05:30 IST

మాట వినడం లేదంటూ 30 గంగపుత్రుల కుటుంబాలను వెలివేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

Nirmalలో 30 గంగపుత్రుల కుటుంబాల వెలి

నిర్మల్: మాట వినడం లేదంటూ 30 గంగపుత్రుల కుటుంబాలను వెలివేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. లోకేశ్వరం మండలం రాజురాలో వీడీసీ ఈ అరాచకానికి పాల్పడ్డాడు. గ్రామంలోని చేపల చెరువు విషయంలో తగాదా నెలకొంది. సోషల్ బాయ్ కాట్‌తో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఊర్లో ఎవ్వరూ మాట్లాడటం లేదని, చివరికి పిల్లలను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే  ఆత్మహత్యలు చేసుకుంటామని బాధితులు వెల్లడించారు. 

Updated Date - 2022-06-22T15:03:55+05:30 IST