30 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-14T05:46:45+05:30 IST
30 మందికి కరోనా
మరో బాధితుడు మృతి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో బుధవారం 30 మందికి కరోనా సోకింది. కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాధితుడు మరణించాడు. కొత్త కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,270కు చేరింది. మరణాలు అధికారికంగా 674కు పెరిగాయి. 347 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.