సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురు మహిళలు
ABN , First Publish Date - 2021-08-18T17:49:56+05:30 IST
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళుతున్నారు. సుప్రీం జడ్జిలుగా మొత్తం 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ బేల త్రివేది ఉన్నారు. అలాగే సుప్రీం కోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది జస్టిస్ పీఎస్ నరసింహ కూడా కొలీజియం సిఫార్స్ చేసిన వారిలో ఉన్నారు. వారిలో నాగరత్న, నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. న్యాయమూర్తులు ఏఎస్ ఓకా, విక్రమ్, జేకే మహేశ్వరి, సీటీ రవికుమార్, సుందరేష్లను కొలీజియం సిఫార్సు చేసింది.