కామారెడ్డిలో 3 పాజిటివ్ కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-07-05T11:24:15+05:30 IST
జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డీఎంహెచ్వో చంద్రశేఖర్ శనివారం తెలిపారు
కామారెడ్డి టౌన్, జూలై 4: జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డీఎంహెచ్వో చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇందులో కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఇద్దరికి, ఇస్లాంపుర వాసికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కాగా వీరు ముగ్గురు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని ఆధార్ కార్డులో మాత్రం కామారెడ్డి చిరునామా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 76 కేసులు నమోదు కాగా ఇందులో 53 కేసులు యాక్టివ్ పాజి టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. శనివారం మొత్తం 81 మంది రక్త నమూనాలు సేకరించగా అందులో జిల్లా ఆసుపత్రి నుంచి 38, బాన్సువాడ ఏరియా ఆసుపత్రి నుంచి 43 ఉన్నట్లు తెలిపారు.