బీరుట్లో మరో 3 మృతదేహాల వెలికితీత
ABN , First Publish Date - 2020-08-08T08:40:34+05:30 IST
లెబనాన్ రాజధాని బీరుట్లో ఓడరేవు వద్ద చోటు చేసుకున్న భారీ పేలుళ్ల వల్ల కూలిన భవనాల శిథిలాల నుంచి మరో ముగ్గురి మృతదేహాలను శుక్రవారం బయటకు తీశారు...
బీరుట్, ఆగస్టు 7: లెబనాన్ రాజధాని బీరుట్లో ఓడరేవు వద్ద చోటు చేసుకున్న భారీ పేలుళ్ల వల్ల కూలిన భవనాల శిథిలాల నుంచి మరో ముగ్గురి మృతదేహాలను శుక్రవారం బయటకు తీశారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్రెంచ్, రష్యా నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 149కి చేరింది. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. పదుల సంఖ్యలో లెబనాన్ పౌరుల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. పేలుళ్ల ధాటికి పలు ఆస్పత్రులూ దెబ్బ తినడంతో రోగులు చికిత్స అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.