3 ఎమ్మెల్సీ స్థానాలే ఖాళీ!
ABN , First Publish Date - 2020-07-14T08:03:48+05:30 IST
శాసనమండలిలో ప్రస్తుతం 3 ఖాళీలే భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ఎంపీ పిల్లి సుభా్షచంద్ర బోస్
- మోషేన్రాజు, మర్రి రాజశేఖర్ ఖరారు?
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో ప్రస్తుతం 3 ఖాళీలే భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ఎంపీ పిల్లి సుభా్షచంద్ర బోస్ రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరిగే అవకాశం లేనట్లు సమాచారం. ఆ సీటు కాలపరిమితి 2021 మార్చి 29 వరకే ఉంది. అంటే 9 నెలలు మాత్రమే ఉన్నందున దానికి ఎన్నిక జరిగే అవకాశం లేదని అటున్నా రు. దీంతో గవర్నర్ కోటాలో 2 స్థానాలు, ఎమ్మెల్యేల కోటాలో ఒక్కస్థానం మాత్రమే భర్తీ చేయనున్నారు. గవర్నర్ కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ను సీఎం జగన్ దాదాపు ఖరారు చేశారని వైసీపీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశముందన్నాయి. మరో స్థానాన్ని కడపకు చెందిన మైనారిటీ మహిళతో భర్తీ చేసే చాన్సుందని వెల్లడించాయి. తమకో ఎమ్మెల్సీ సీటివ్వాల ని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన మైనారిటీ నేతలు కోరుతున్నారని.. ఈ నేపథ్యంలో రాయచోటికి చెందిన ముస్లిం మై నారిటీ మహిళకు ఈ పదవి ఇవ్వాలని భావిస్తున్నారు.