మాజీ డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల దారుణ హత్య

ABN , First Publish Date - 2021-04-21T23:24:04+05:30 IST

మధ్య ప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ప్యారేలాల్ కన్వర్‌కి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తుల ..

మాజీ డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల దారుణ హత్య

భోపాల్: మధ్య ప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ప్యారేలాల్ కన్వర్‌కి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇవాళ పోలీసులు వెల్లడించారు. కోర్బాలోని ఓ గ్రామంలో ప్యారేలాల్ కన్వర్‌ కుమారుడు, కోడలు, మనవరాలి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పదునైన ఆయుధాలతో దుండగులు వారిని చంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ‘‘హరీశ్ కన్వార్, సుమిత్ర కన్వార్, ఆషి కన్వార్ (5) తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది..’’ అని కోర్బా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. కాగా ఈ విషయం తెలియగానే రెవెన్యూ మంత్రి జైసింగ్ అగర్వాల్ సహా  కాంగ్రెస్ సీనియర్ నేతలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

Updated Date - 2021-04-21T23:24:04+05:30 IST