రూ.3 కోట్ల కారులో మామిడి పండ్లు

ABN , First Publish Date - 2020-07-05T17:29:59+05:30 IST

మూడు కోట్ల రూపాయలకు పైగా ఖరీదైన లగ్జరీ కారు లంబోర్గిని. ఆ కారులో ఒక సూపర్‌ మార్కెట్‌ యజమాని మామిడి పండ్లు డెలివరీ చేస్తున్నాడు. దుబాయ్‌లో అతి పెద్ద....

రూ.3 కోట్ల కారులో మామిడి పండ్లు

మూడు కోట్ల రూపాయలకు పైగా ఖరీదైన లగ్జరీ కారు లంబోర్గిని. ఆ కారులో ఒక సూపర్‌ మార్కెట్‌ యజమాని మామిడి పండ్లు డెలివరీ చేస్తున్నాడు. దుబాయ్‌లో అతి పెద్ద సూపర్‌మార్కెట్‌ చైన్‌ ‘పాకిస్తాన్‌ సూపర్‌ మార్కెట్‌’. వాటి యజమాని మొహమ్మద్‌ జెనాబ్‌. అతనికి మూడు కోట్ల విలువైన ఆకుపచ్చని లంబోర్గిని కారు ఉంది. కరోనాతో లాక్‌డౌన్‌ అయిన దుబాయ్‌ ఇప్పుడిప్పుడే తెరుచు కుంటోంది. ఇలాంటి సమయంలో తన వినియోగదారుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యాడు. మామిడి పండ్లు ఆర్డర్‌ ఇచ్చినవాళ్లకి... ఆ పండ్లను తన కారులో తీసుకెళ్లి డెలివరీ చేస్తానని, వినియోగదారులను కూడా కాసేపు కారులో తిప్పుతానని ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చాడు. మామిడి పండ్ల బుట్ట ధర వంద దినార్లుగా నిర్ణయించాడు. అంటే మన రూపా యల్లో రెండు వేల పైనే. ఇంకేముంది ఖరీదైన కారులో ఒక్కసారన్నా తిరగాలన్న ఆశతో అనేకమంది మామిడిపండ్లకు ఆర్డరిచ్చారు. కారులో ఓసారి ఎక్కి కూర్చుని ఫోటోలు దిగి ఆనందపడ్డారు. మామిడిపండ్ల కోసం కాదు... ఆ కారు కోసమే తాము ఆర్డర్లు పెట్టినట్టు పేర్కొన్నారు జనం. 

Updated Date - 2020-07-05T17:29:59+05:30 IST