ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగుల పరారీ..
ABN , First Publish Date - 2020-08-13T20:25:59+05:30 IST
ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. వార్డు నంబర్ 215 నుంచి చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావు..
ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్ నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. వార్డు నంబర్ 215 నుంచి చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావు.. 216 నుంచి రాచర్ల మండలం అక్కిరెడ్డిపల్లెకి చెందిన ఎల్.నారాయణరెడ్డి, ఎల్.రామలక్షణ రెడ్డి సిబ్బందికి చెప్పకుండా వెళ్ళిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా జీజీహెచ్ను సమస్యలు చుట్టుముట్టాయి. నాలుగు రోజుల క్రితం జీజీహెచ్లో మృతి చెందిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. ఇటీవల జీజీహెచ్లో కరోనా రోగులకు పెడుతున్న ఆహారం, సౌకర్యాలపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. జీజీహెచ్లో సమస్యల వల్లే రోగులు ఆసుపత్రి నుంచి చెప్పకుండా వెళ్లిపోయి ఉంటారని పలువురు భావిస్తున్నారు.