పార్లమెంట్ భవన నిర్మాణ రేసులో 3 కంపెనీలు
ABN , First Publish Date - 2020-08-13T07:41:03+05:30 IST
ప్రతిపాదిత నూతన పార్లమెంట్ భవన నిర్మాణ రేసులో మూడు దిగ్గజ కంపెనీలున్నాయి. ఈ భవన నిర్మాణానికి అవసరమైన ప్రీ క్వాలిఫికేషన్కు ఏడు కంపెనీలు దరఖాస్తు చేయగా వీటిలో లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్...
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రతిపాదిత నూతన పార్లమెంట్ భవన నిర్మాణ రేసులో మూడు దిగ్గజ కంపెనీలున్నాయి. ఈ భవన నిర్మాణానికి అవసరమైన ప్రీ క్వాలిఫికేషన్కు ఏడు కంపెనీలు దరఖాస్తు చేయగా వీటిలో లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టీ), షాపూర్జీ పల్లోంజీ, టాటా ప్రాజెక్ట్స్ ను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) ఎంపిక చేసింది. ఐ ఈ మూడు కంపెనీలు ఆన్లైన్ ద్వారా తమ ఫైనాన్షియల్ బిడ్స్ను దాఖలు చేయాల్సి ఉంటుందని సీపీడబ్ల్యూడీ పేర్కొంది. రూ.889 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.