ఉత్సాహంగా 2కె రన్‌

ABN , First Publish Date - 2022-08-12T04:22:04+05:30 IST

స్వాతంత్ర సమరయో ధులు, వీరులు చేసిన త్యాగాలను భావితరాలకు చాటి చెప్పా లని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. గురువారం ఐబీ చౌరస్తాలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 2కే రన్‌ ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీసీపీ అఖిల్‌ మహజన్‌, డీఎఫ్‌వో శివాణి డోంగ్రేతో కలిసి నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల వరకు రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వీరుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకుంటూ వారి అడు గు జాడల్లో నడవాలన్నారు.

ఉత్సాహంగా 2కె రన్‌
2కే రన్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిర్వహణ

పాల్గొన్న కలెక్టర్‌, డీసీపీ, ఎమ్మెల్యేలు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 11: స్వాతంత్ర సమరయో ధులు, వీరులు చేసిన త్యాగాలను భావితరాలకు చాటి చెప్పా లని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. గురువారం  ఐబీ చౌరస్తాలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 2కే రన్‌ ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీసీపీ అఖిల్‌  మహజన్‌, డీఎఫ్‌వో శివాణి డోంగ్రేతో కలిసి నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల వరకు రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వీరుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకుంటూ వారి అడు గు జాడల్లో నడవాలన్నారు. ప్రతీ ఇంటిపై 13 నుంచి 15 వర కు జెండా ఎగరవేయాలని,  ఈనెల 22 వరకు ఏర్పాటు చేసి న కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాల న్నారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీసీపీ అఖిల్‌ మహ జన్‌లు మాట్లాడుతూ వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛాయుత భారతదేశమన్నారు. డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీపీవో  నారాయ ణరావు,  డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, 13వ బెటాలియన్‌ కమాండెంట్‌ రామకృష్ణ, సీఐ శ్రీనివాస్‌, సీఐ నారాయణనా యక్‌, ఎస్సై తహసినోద్దీన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, కమిషనర్‌ బాలకృష్ణ, నడిపెల్లి విజి త్‌రావు, కౌన్సిలర్లు ప్రకాష్‌ నాయక్‌, రవిందర్‌రావు,  వ్యాఖ్యాత గుండేటి యోగేశ్వర్‌, అల్లాడి శ్రీనివాస్‌, పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-12T04:22:04+05:30 IST