296 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-31T10:07:54+05:30 IST

296 కరోనా కేసులు

296 కరోనా కేసులు

తిరుపతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మరో 296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో కలిపి  జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 80652కు చేరుకుంది. కొత్తగా గుర్తించిన 296 కేసుల్లో తిరుపతి నగరంలో 59, చిత్తూరులో 35, మదనపల్లె, తిరుపతి రూరల్‌ మండలాల్లో 16 చొప్పున, పీలేరు మండలాల్లో 13 చొప్పున, శ్రీకాళహస్తిలో 12, కలికిరిలో 10, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఐరాల మండలాల్లో 9 చొప్పున, శ్రీరంగరాజపురంలో 8, చౌడేపల్లె, జీడీనెల్లూరు మండలాల్లో 7 చొప్పున, పిచ్చాటూరు, పుత్తూరు, రామచంద్రాపురం మండలాల్లో 6 చొప్పున, గుర్రంకొండ, రేణిగుంట మండలాల్లో 5 చొప్పున, నగరి, గంగవరం, విజయపురం, యాదమరి, ఏర్పేడు మండలాల్లో 4 చొప్పున, గుడిపాల, నారాయణవనం, పాకాల మండలాల్లో 3 చొప్పున, పలమనేరు, కలకడ, నాగలాపురం, శాంతిపురం, సత్యవేడు, తొట్టంబేడు, వడమాలపేట, వాల్మీకిపురం మండలాల్లో 2 చొప్పున, బి.కొత్తకోట, బైరెడ్డిపల్లె, గుడుపల్లె, కుప్పం, కురబలకోట, నిండ్ర, పీటీఎం, పెద్దపంజాణి, పెనుమూరు, సదుం, వరదయ్యపాలెం, వి.కోట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2020-10-31T10:07:54+05:30 IST