పోలీసు స్పందనకు 29 అర్జీలు..

ABN , First Publish Date - 2022-06-28T05:34:10+05:30 IST

పాత పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 29 అర్జీలు వచ్చాయి.

పోలీసు స్పందనకు 29 అర్జీలు..
బాధితురాలితో మాట్లాడుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు, జూన్‌ 27: పాత పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 29 అర్జీలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ రిషాంత్‌రెడ్డి నేరుగా మాట్లాడి వినతిపత్రాలను స్వీకరించారు. వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. 29 అర్జీల్లో చీటింగ్‌ 1, మిస్సింగ్‌ 1, వేధింపులు 6, చిన్న తగాదాలు 2, కుటుంబ తగాదాలు 5, ఆస్తి తగాదాలు 12 ఉన్నాయి. ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ఎంటీవో మధు, ఎస్‌ఐ మాధవ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:34:10+05:30 IST