ఔరంగాబాద్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-07-01T04:50:20+05:30 IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే మరో..

ఔరంగాబాద్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే మరో 282 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో గుర్తించారు. దీంతో జిల్లాలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 5,565కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఔరంగాబాద్ సిటీలోనే 219 కేసులు ఉండగా.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి కారణంగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 263కు చేరింది. కాగా ఇవాళ 72 మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2741కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 2,561 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-07-01T04:50:20+05:30 IST