27న రాజమహేంద్రవరంలో సామాజిక న్యాయభేరి

ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST

: ఈనెల 27న రాజమహేంద్రవరంలోని మున్సిపల్‌ స్టేడియంలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌ కృష్ణ తెలిపారు.

27న రాజమహేంద్రవరంలో సామాజిక న్యాయభేరి

 ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేణు, ఎమ్మెల్యే రాజా 

రాజమహేంద్రవరం, మే 24(ఆంధ్రజ్యోతి): ఈనెల 27న రాజమహేంద్రవరంలోని మున్సిపల్‌ స్టేడియంలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌ కృష్ణ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ స్టేడియం గ్రౌండ్‌లో మంగవారం ఆయన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ  ఆరోజు సాయంత్రం 4గంటలకు ఈ భేరి మొదలవుతుందని, నగర ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సుమారు  25వేల మందితో నిర్వహించనున్నామన్నారు. వాస్తవానికి ఈనెల 26న ఈభేరి బస్సుయాత్ర మొదలైన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించి, 27న ముగుస్తుందని తెలిపారు. వైసీపీ సిటీ  ప్రెసిడెంట్‌  నందెపు శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ డీఎస్పీలు కేవీఎన్‌ వరప్రసాద్‌, సంతోష్‌, సౌత్‌జోన్‌ డీఎస్పీ ఎం.శ్రీలత, ట్రాఫిక్‌ సీఐ రమణి పాల్గొన్నారు.



Updated Date - 2022-05-24T05:30:00+05:30 IST