276 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-15T11:01:12+05:30 IST
276 పాజిటివ్ కేసులు
- నలుగురు మృతి
కడప, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గత పదిరోజులతో పోలిస్తే సోమవారం కరోనా కేసుల నమోదు సంఖ్య తగ్గింది. 276 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటితో కలిసి కరోనా బాధితుల సంఖ్య 36,922కు చేరింది. కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటి దాకా కరోనా బారిన పడి 381 మంది మృత్యువాత పడ్డారు. కరోనా సోకి కొవిడ్ ఆస్పత్రులు, సెంటర్లలో చికిత్స పొందుతూ 1021 మంది సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి దాకా కోలుకున్న వారి సంఖ్య 30,807కు చేరింది. ప్రస్తుతం కొవిడ్ ఆస్పత్రుల్లో 1562, హోం ఐసోలేషన్లో 4019 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, టి.సుందుపల్లి, రైల్వేకోడూరు మండలాల్లో సంజీవని బస్సుల ద్వారా కరోనా శ్వాబ్ టెస్ట్లు చేయనున్నారు.