ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 275 మంది భారతీయులు...
ABN , First Publish Date - 2020-03-29T19:27:33+05:30 IST
కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలా మంది భారతీయులు వివిధ దేశాలలో చిక్కుకుపోయారు.
జోధ్పూర్: కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలా మంది భారతీయులు వివిధ దేశాలలో చిక్కుకుపోయారు. తాజాగా ఇరాన్లో చిక్కుకుపోయిన 275 మంది భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం వీరందరూ రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు.
అనంతరం స్థానిక ఆర్మీ క్యాంపుల్లో కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇక భారతదేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 25కి చేరింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మంది కోలుకున్నారు. అటు ఇరాన్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 35,408 మంది కరోనా బాధితులు ఉండగా, 2,517 మంది మరణించారు.