2.7 కోట్ల ఎన్95 మాస్కులు అవసరం
ABN , First Publish Date - 2020-04-10T07:30:31+05:30 IST
కరోనా విజృంభణ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో భారత్కు దాదాపు 2.7 కోట్ల ఎన్95 మాస్కులు, 1.5 కోట్ల పీపీఈలు ...
- భారత్కు 2 నెలల్లో 1.5 కోట్ల పీపీఈలు కావాలి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కరోనా విజృంభణ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో భారత్కు దాదాపు 2.7 కోట్ల ఎన్95 మాస్కులు, 1.5 కోట్ల పీపీఈలు అవసరమని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అలాగే, 16 లక్షల కొవిడ్-19 పరీక్షల కిట్లు, 50 వేల వెంటిలేటర్ల అవసరముంది. వీటి కొరత తీర్చడం కోసం ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి ఉత్పత్తి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఓ ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు. అవసరమున్న 50 వేల వెంటిలేటర్లలో ఇప్పటికే 16 వేలు అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా, దేశంలోని పలు ఆస్పత్రుల్లో ఇప్పటికే వైద్యులు పీపీఈల కొరత ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో మార్చి 22 నాటికి 4,824 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వైద్య సిబ్బందికి పీపీఈలు అందుబాటులో ఉంచడం ఎంత అవసరమో దీని ద్వారా తెలుసుకోవచ్చు.