26 నుంచి వీఎస్కే డిగ్రీ, పీజీ పరీక్షలు
ABN , First Publish Date - 2021-07-22T17:00:16+05:30 IST
విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 26 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు పరీక్షల విభాగం రిజిస్ట్రార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20
బళ్లారి(కర్ణాటక): విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 26 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు పరీక్షల విభాగం రిజిస్ట్రార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ 1, 3వ సెమిస్టర్ లిఖిత పరీక్షలు నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. ఇదే సంవత్సరం 6వ సెమిస్టర్ పరీక్షలు మినహా, మిగిలిన సెమిస్టర్ ఫలితాలను ప్రమోట్ ఆధారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కరోనా టీకా తప్పకుండా వేయించుకోవాలని సూచించారు.