లుధియానా సెంట్రల్ జైలులో 26 మంది ఖైదీలకు కరోనా
ABN , First Publish Date - 2020-07-05T22:13:12+05:30 IST
పంజాబ్లో కరోనా వైరస్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతి రోజూ కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో
చండీగఢ్: పంజాబ్లో కరోనా వైరస్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతి రోజూ కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, లుధియానాలోని సెంట్రల్ జైలులో 26 మంది ఖైదీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్లో ఉంచి ఇతర ఖైదీలతో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, వారి కాంటాక్ట్లను ట్రేసింగ్ చేస్తున్నారు. వారికి కరోనా ఎలా సోకిందన్న దానిపై ఆరా తీస్తున్నట్టు లుధియానా చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ బగ్గా తెలిపారు. కాగా, పంజాబ్లో ఇప్పటి వరకు 6,109 కేసులు నమోదు కాగా, 1,641 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 4,306 మంది కోలుకోగా, 162 మంది కరోనా కాటుకు బలయ్యారు.