26 కొవిడ్ పాజిటివ్లు
ABN , First Publish Date - 2021-10-19T06:32:06+05:30 IST
జిల్లాలో సోమవారం కొత్తగా 26 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి.
ఒంగోలు (కార్పొరేషన్/ కలెక్టరేట్), అక్టోబరు 18 : జిల్లాలో సోమవారం కొత్తగా 26 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,38,243 మంది కొవిడ్ బారిన పడ్డారు. వారిలో 1,36,409 మంది కోలుకున్నారు. 1,115మంది మరణించారు. ప్రస్తుతం 719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 133 కేంద్రాల్లో సోమవారం 55,025 మందికి టీకాలు వేశారు.