25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం
ABN , First Publish Date - 2022-04-23T18:11:03+05:30 IST
రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ఉష్ణచలనం కారణంగా ఈ నెల 25 వరకు పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం
ఐసిఎఫ్(చెన్నై): రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ఉష్ణచలనం కారణంగా ఈ నెల 25 వరకు పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ప్రారంభానికి రెండు వారాలున్న నేపధ్యంలో, కరూర్, తిరుచ్చి, తిరుత్తణి, చెన్నై, వేలూరు, కడలూరు తదితర ప్రాంతాల్లో ఎండ తీవ్రత 37 డిగ్రీల సెల్సియ్సకు చేరుకుంది. ఈ కారణంగా ఏర్పడిన ఉష్ణచలనంతో సేలం, నామక్కల్ సహా డెల్టా జిల్లాలు, పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తాయని, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.