కరోనా రిపోర్ట్: కర్ణాటకలో 257 పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-06-05T00:54:53+05:30 IST

కర్ణాటకలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ...

కరోనా రిపోర్ట్: కర్ణాటకలో 257 పాజిటివ్ కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  257 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మరణించారు. 106 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని కేసుల సంఖ్య 4,320కి చేరింది. వీరిలో 1,610 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,651 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 57 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-06-05T00:54:53+05:30 IST