ఆ దేశంలో 250 మంది భారతీయులకు కరోనా..
ABN , First Publish Date - 2020-04-11T03:07:45+05:30 IST
సింగపూర్లో నివశిస్తున్న 250 మంది భారతీయులు కరోనా బారిన పడినట్లు...
న్యూఢిల్లీ: సింగపూర్లో నివశిస్తున్న 250 మంది భారతీయులు కరోనా బారిన పడినట్లు భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్ తెలిపారు. వీరిలో సగానికి పైగా విదేశీ కార్మికులకు దగ్గరగా నివశిస్తుంటారని, వారి ద్వారా వీరికి కరోనా వ్యాప్తి జరిగి ఉండవచ్చిన ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వీరిలో దాదాపు అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.