ఆగ్రాలో 25 కొత్త కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-04T21:14:49+05:30 IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. భారత్‌లో ఇప్పటికే...

ఆగ్రాలో 25 కొత్త కరోనా కేసులు

ఆగ్రా: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరాలు బయటపెట్టారు. కొత్తగా నమోదైన కరోనా కేసులన్నీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివేనని తెలుస్తోంది. ఈ 25 కేసులతో ఆగ్రాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 45కి చేరింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 175 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

Updated Date - 2020-04-04T21:14:49+05:30 IST