AP News: 25 ఎంపీ స్థానాలు మావే.. అంబటి రాంబాబు
ABN , First Publish Date - 2022-08-21T00:39:19+05:30 IST
Amaravathi: ఈ సారి జరిగే ఎన్నికలలో 25 ఎంపీ స్థానాలు తమవేనని మంత్రి అంబటి రాంబాబు (Ambati Ram Babu) ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కుల అహంకారంతో
Amaravathi: ఈ సారి జరిగే ఎన్నికలలో 25 ఎంపీ స్థానాలు తమవేనని మంత్రి అంబటి రాంబాబు (Ambati Ram Babu) ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కుల అహంకారంతో పాలన చేయడంతో 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. పోలవరం (Polavaram Project) విషయంలో తన మూడు ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పలేదన్నారు. పోలవరాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు (Chandrababu Naidu) అండ్ కో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి ప్రాజెక్టుని ఎందుకు తీసుకున్నారు ? 2018 కి పూర్తి చేస్తామని ఎందుకు చెయ్యలేదు? కాపర్ డ్యామ్ పూర్తి చెయ్యకుండా డాయ ఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారో? ఇప్పుడైనా చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి ఎంపి మాధవ్ మార్పింగ్ వీడియో తప్ప మిగతా సమస్యలు లేవా..? అని ప్రశ్నించారు.